
కొత్తగా ఇల్లు కొనుక్కున్నా.. కట్టుకున్నా.. ఈ కాలంలో దేవుడి గది.. కిచెన్ సపరేట్ గా ఉండేలా చూస్తున్నారు. కాని కట్టిన ఇళ్లలో ప్రత్యేకంగా దేవుడి గది ఉండదు.. అప్పుడు ఈశాన్య దిక్కులో దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆగ్నేయంలో కిచెన్ ఉంటుంది. వంట చేసేటప్పుడు వచ్చే ఆవిరికి దేవుడి పటాలు జిడ్డుపడతాయి.. ఇలాంటప్పుడు ఏం చేయాలి.. ఇంట్లో నీళ్లహౌజ్ ఏ దిక్కులో ఉండాలి... వాస్తు ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ..వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అందిస్తున్న సలహాలను ఒకసారి తెలుసుకుందాం.
ప్రశ్న :మా ఇంట్లో తూర్పు దిక్కున కిచెన్, దేవుడి రూమ్స్ కలిసే ఉన్నాయి. వంట చేయడం వల్ల దేవుడి పటాలు, విగ్రహాలకు జిడ్డుపడుతుంది. వాటిని వేరువేరు గదులుగా మార్చుకోవచ్చా?
జవాబు: వాస్తు ప్రకారం తూర్పువైపు ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి. వంట వండేవాళ్లు ఈస్ట్ ఫేస్ పెట్టి వంట చేయాలి. వంటగదిని. దేవుడి గదిని వేరు చేసుకోవడానికి మధ్యలో సన్నటి గోడ కట్టుకోండి... లేదా కర్టెన్ కట్టినా సరిపోతుంది. అయితే ఎక్కడైనా వంటగది ఇంటిలో నాలుగోభాగం కంటే తక్కువగా ఉండాలి.
ప్రశ్న :మా ఇంటికి ఉత్తరం వైపు మరో ఇల్లు కట్టుకున్నాం. దాంట్లో మా అన్న ఉంటున్నాడు. సరిగ్గా రెండు ఇళ్లకు మధ్య తూర్పు దిక్కున గచ్చు ఉంది. అక్కడే నీళ్లు నిల్వచేసుకునే హౌజ్ ఉండడంతో బట్టలు ఉతకడం, చిన్నపిల్లలకు స్నానాలు.. వాటికి వాడుతున్నాం. అలా వాడుకోవచ్చా?
జవాబు: నీళ్ల హౌజ్ ఒక ఇంటికి నైరుతి దిక్కు, మరో ఇంటికి ఆగ్నేయం అవుతుంది. ఒకరికి మంచిదే కానీ మరొకరికి మంచిది కాదు. అన్న దక్షిణంలో, తమ్ముడు ఉత్తరంలో ఉండాలి. ఇంటికంటే హౌజ్ ఎత్తులో ఉందా, దిగువన ఉందా అనేది కూడా ముఖ్యం. రెండిళ్లకు మధ్య ఉంది కాబట్టి, రెండిళ్లకు పూర్తిగా ఈశాన్యంలోకి మార్చుకోవాలి. మీ అన్న ప్రత్యేకంగా హౌజ్ కట్టించుకున్నా ఫర్వాలేదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.