
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలో విషాదం జరిగింది. 29 మందితో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి నగ్రమ్ దగ్గర ఇందిరా కాల్వలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేప్టటారు. కాల్వలో పడిపోయిన వాహనంలో ఉన్న 22 మందిని రక్షించారు. మరో ఏడుగురు చిన్నారులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ విపత్తు నిర్వహణా దళాలతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఎస్ఎస్పీకి సూచించారు. పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టాయి.