కొత్తకోట పట్టణంలో వాహన తనిఖీల్లో రూ. 4.5లక్షలు స్వాధీనం

కొత్తకోట పట్టణంలో వాహన తనిఖీల్లో రూ. 4.5లక్షలు స్వాధీనం

కొత్తకోట, వెలుగు: పట్టణంలో మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 4 లక్షల 50 వేలను పట్టుకున్నట్టు ఎస్​ఐ మంజునాథ్​ రెడ్డి తెలిపారు.  కోడ్​ ఆఫ్​ కండక్ట్​లో భాగంగా పట్టణంలో  తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. 

 ఈ క్రమంలో  ఓ స్కూటీపై బ్యాగ్​తో వచ్చిన  వ్యక్తిని తనిఖీ చేశారు. అతను రూ. 4 లక్షల 50 వేలను తీసుకెళ్తున్నాడు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో  ఆ నగదను సీజ్​ చేసినట్టు పోలీసులు తెలిపారు.