- ఫ్యాన్సీ నంబర్ల రిజర్వేషన్ కూ అవకాశం
- రూ.9,11,111కు ‘TG 09, 0001’ నంబర్
- దక్కించుకున్న వాహనదారుడు
- ఫస్ట్రోజే ఆర్టీఏకు రూ. 2,51,86,437 ఆదాయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్నంబర్సిరీస్టీఎస్ కుబదులు టీజీగా మారిపోయింది. ఆర్టీఏ అధికారులు శుక్రవారం నుంచి దీనిని అమలులోకి తెచ్చారు. ఈ మేరకు ఆర్టీఏ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రసాద్ బటన్నొక్కి రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వం గెజిట్విడుదల చేసిందన్నారు. అలాగే, శుక్రవారం ఉదయం 8గంటల నుంచి నంబర్ల రిజర్వేషన్ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. ఇప్పటికే టీఎస్నంబర్ప్లేట్తో ఉన్నవాటిని టీజీగా మార్చడానికి అవకాశం లేదన్నారు. చట్టంలో ఆ వెసులుబాటు లేదు కాబట్టి అవి టీఎస్సిరీస్తోనే కొనసాగుతాయన్నారు. ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ 0001 నంబర్తోప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఆర్టీవో, యూనిట్ కార్యాలయంలో శుక్రవారం నుంచే ప్రారంభమైందన్నారు.
కాబట్టి వాహనదారులు 0001 నుంచి 0999 వరకు రిజర్వు చేసుకోవచ్చని కమిషన్ తెలిపారు. ప్రతి రోజు అంతకు ముందు రోజు రిజిస్ట్రేషన్ అయిన నంబర్ నుంచి 1000 లోపు ప్రస్తుత విధానంలోనే టీజీ సిరీస్లో రిజర్వు చేసుకునే అవకాశం ఉందన్నారు. కాగా, రాష్ట్రంలో ఏపీ సిరీస్ తోరిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ 70,68,252 ఉండగా.. టీఎస్సిరీస్తో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు 92,82,903 ఉన్నట్టు అధికారులు తెలిపారు.
మొదటి రోజే భారీగా ఆదాయం
స్టేట్లో వెహికల్నంబర్ల సిరీస్ను టీఎస్నుంచి టీజీలోకి మార్చిన మొదటి రోజే ఆర్టీఏకు భారీగా ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో మొత్తం రూ.30,49,589ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇందులో రిజర్వేషన్ల ద్వారా రూ.7,52,000లు రాగా, ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా రూ.22,97,589 ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, టీజీ 09, 0001 నంబర్ను రుద్రరాజు రాజీవ్కుమార్అనే వాహనదారుడు దక్కించుకున్నారు.
దీనికిగాను ఆయన రూ.50 వేలు రిజర్వేషన్ఫీజు చెల్లించి.. వేలంలో రూ.9,11,111లకు నంబర్ సొంతం చేసుకున్నారు. అలాగే, టీజీ 09, 0909 నెంబర్ను భవ్యసింధు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో రూ.2,20,909లకు దక్కించుకుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఫీజు రూపంలో రూ.1,25,11,000 లు, నంబర్లవేలం ద్వారా రూ.1,26,75,437 లు కలిపి మొత్తం ఒక్కరోజులోనే ఆర్టీఏకు రూ.2,51,86,437ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.