సైబరాబాద్ పోలీసులు అదుపులో వెలగపూడి రఘుతేజ ఉన్నారు. డ్రగ్స్ కేసులో రఘతేజను పోలీసులు విచారిస్తున్నారు. గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో డ్రగ్స్ కేసు నమోదు అయింది. రఘుతేజతో పాటుగా మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు.
డ్రగ్ పెడ్లర్స్ అయిన చింతా రాకేష్ , శ్రీనివాస్ రెడ్డి తో రఘు తేజకు డ్రగ్స్ ఇచ్చినట్లుగా పోలీసులు తేల్చారు. గతంలో ఇన్ఫినిటీ పబ్ నిర్వాకుడిగా పనిచేశారు రఘుతేజ.