- ఇంటర్నేషనల్ కార్టూన్ పోటీల్లో వెలుగు కార్టూనిస్ట్కు ప్రైజ్
- గాంధీ థీమ్తో పోటీలు
- కారికేచర్ విభాగంలో జక్కుల వెంకటేశ్కు థర్డ్ ప్రైజ్
హైదరాబాద్, వెలుగు: మహాత్మాగాంధీ థీమ్తో నిర్వహించిన ఇంటర్నేషనల్ కార్టూన్అండ్ కారికేచర్ పోటీల్లో ‘వెలుగు’ కార్టూనిస్ట్ జక్కుల వెంకటేశ్ థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. 54 దేశాల నుంచి 408 మంది కార్టూనిస్టులు పోటీ పడగా.. ఫైనలిస్టుల జాబితాలో ఆయన మూడో స్థానాన్ని (కారికేచర్ కేటగిరీ) సాధించారు. మొదటి స్థానంలో బ్రెజిల్కు చెందిన యాలిసన్ ఓర్టిజ్, రెండో స్థానంలో ఇరాన్కు చెందిన సమీద్ సూఫీలు నిలిచారు. నిరుడు డిసెంబర్లో పోటీలను ప్రారంభించగా.. ఈ ఏడాది జనవరి 15న ఫైనలిస్టుల జాబితాను ప్రకటించారు. కారికేచర్విభాగంలో 51 మంది, కార్టూన్ విభాగంలో 25 మంది ఫైనల్ లిస్టులో చోటు సంపాదించారు. మొదటి ప్రైజ్గా రూ.25 వేలు, రెండో ప్రైజ్కు రూ.20 వేలు, మూడో ప్రైజ్కు రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ‘ఏక్తా పరిషద్’ అనే స్వచ్ఛంద సంస్థ.. Irancartoon.com అనే ప్లాట్ఫాం ద్వారా ‘గాంధీ– యాన్ ఆన్సర్ ఫర్ గ్లోబల్ క్రైసిస్’ అనే థీమ్తో ఈ పోటీలను నిర్వహించింది.