
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వరస్వామిఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం రూ.కోటి 89 లక్షల పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్లో 14రోజుల హుం డీల ఆదాయాన్ని లెక్కిం చారు. కోటి 89 లక్షల 81 వేల 7 రూపాయాల నగదు, 198 గ్రాముల 430 మిల్లీ గ్రాముల బంగారం, 17 కిలోల 550 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. హుండీ లెక్కింపులో అధికారులు, సిబ్బందితోపాటు సత్యసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.