
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులుదీరారు. ఉదయమే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానం అచరించారు. తర్వాత స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి నాలుగు గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారి దర్శనం అనంతరం వేలాది మంది కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు వేములవాడ అనుబంధమైన భీమేశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది.