
సీనియర్ నటి జమునకు వెండితెర దిగ్గజం పురస్కారాన్ని గురువారం ప్రదానం చేశారు. ప్రాజ్ఞిక ఫౌండేషన్, సీల్ వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులుగా రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, బేటీ బచావో.. బేటీ పడావో రాష్ట్ర కన్వీనర్గీతామూర్తి, సీల్వెల్ సుబ్బారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యక్తలు మాట్లాడుతూ 65 ఏండ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న జమున అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, ఎన్టీఆర్ తదితరులతో నటించి గుర్తింపు పొందిందన్నారు. సత్యభామ పాత్రలో ఆమె నటన మరిచిపోలేనిదని కొనియాడారు.