రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : వెంకటరమణారెడ్డి

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి : వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్​ చేశారు.  క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తానన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. కామారెడ్డి, రాజంపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల్లోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఫసల్​బీమా యోజన అమలు చేసిఉంటే రైతులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. నష్టం జరిగినప్పుడు రైతులకు బీమాతో పాటు పరిహారం వచ్చేదన్నారు. కొన్ని చోట్ల కరెంట్​సప్లయ్​ నిలిచిపోయినందున తిరిగి పునరుద్ధరించాలని ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లకు సూచించారు.