నా మేనల్లుడితో కలిసి నటించడం చాలా హ్యాపీ

నా మేనల్లుడితో కలిసి నటించడం చాలా హ్యాపీ

నవరసాలు ఉన్న సినిమా ఇది

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. రాశీఖన్నా, పాయల్ రాజ్‌‌‌‌‌‌‌‌పుత్ హీరోయిన్స్. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మించారు. ఈనెల 13న సినిమా విడుదల కానున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో వెంకటేష్ మాట్లాడుతూ ‘నా మేనల్లుడితో కలిసి నటించడం చాలా హ్యాపీ. మా నాన్నగారి కోరిక నెరవేరింది. అన్నిరకాల ఎమోషన్స్ పండించి చైతన్య ఆల్ రౌండర్ అనిపించుకోవడం సంతోషంగా, గర్వంగా ఉంది. ఇలాంటి కథని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు.  ప్రతి సన్నివేశాన్నీ పరిణతితో, భావోద్వేగభరితంగా తీశాడు బాబి. అతనికిది బెస్ట్ మూవీ అవుతుంది. తమన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు. మా అన్నయ్య బాధ్యత తీసుకుని సినిమా బాగా వచ్చేందుకు కృషి చేశారు.  వినోదంతో పాటు యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్’ అన్నారు.

‘ఎన్ని సినిమాలు చేసినా నా కెరీర్ లో మనం, వెంకీ మామ సినిమాలకు ఉన్న ప్రాధాన్యత వేరు. కాస్టింగ్, టెక్నికల్ అంశాలతో సహా చాలా విషయాలు చివరి నిముషంలో ఫైనల్ అయ్యాయి. అయినా ప్రతి బెస్ట్ దొరికింది. ఆర్మీ సీన్స్‌‌‌‌‌‌‌‌లో బాబి నన్ను చాలా కొత్తగా చూపించాడు. సురేష్ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌లో చేయడం నా కల. ఆలస్యంగా జరిగినా అద్భుతంగా జరిగింది. మామయ్యతో ప్రతి సీన్ చాలా  ఎక్సయిటయ్యి నటించాను. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను’ అని నాగచైతన్య అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ ‘ప్రేమ, త్యాగం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. రెండేళ్ల క్రితం జనార్దన మహర్షి ఈ కథ చెప్పారు. బాబి దానికి చక్కటి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ రాశారు. రాజమండ్రి, హైదరాబాద్, కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరించాం. ఇటీవల సినిమా చూశాను. మామ, అల్లుడి మధ్య అనుబంధం అందంగా ఉంది. నవరసాలు ఉన్న తెలుగు జానర్ సినిమా ఇది’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తారక్ గారితో తమ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా చేయాలన్న కళ్యాణ్ రామ్ గారి ఆశ నేను తీసిన ‘జై లవకుశ’తో తీరింది. అదే తరహాలో సురేష్ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంకటేష్, నాగచైతన్య కాంబోతో సినిమా చేయడం హ్యాపీ. చైతు పాత్ర బాగుండాలని వెంకటేష్ గారు, ఆయన పాత్ర బాగా రావాలని చైతన్య తపించారు. ప్రతి మామకీ తన మేనల్లుడు గుర్తొచ్చేలా, ప్రతి మేనల్లుడికీ తన మేనమామ గుర్తొచ్చేలా ఉంటుంది సినిమా. హీరోయిన్స్ పాత్రలకీ ప్రాధాన్యత ఉంది’ అని చెప్పారు.

రాశీఖన్నా మాట్లాడుతూ ‘వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. ఈ మామా అల్లుళ్ల అనుబంధాన్ని సినిమాలోనే కాదు సెట్‌‌‌‌‌‌‌‌లోనూ చూశాను. బాబిలోని పాజిటివ్‌‌‌‌‌‌‌‌నెస్ తన సినిమాల్లో ప్రతిబింబిస్తుంది. ఫస్ట్ హాప్ హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా నవ్వుకుంటే.. సెకెండాఫ్‌‌‌‌‌‌‌‌లో ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌కి కనెక్టవుతారు’ అని చెప్పింది. నిర్మాతలు సినిమా విజయవంతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.