వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో భాను భవ తారక దర్శకత్వంలో కార్తీక్ సేపురు, తరుణ్ విఘ్నేశ్వర్ నిర్మిస్తోన్న చిత్రం ‘ప్లాట్’. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. గెస్ట్గా హాజరైన దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం.
క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, సౌండ్ ఇలా అన్నీ ఎంతో సహజంగా అనిపించాయి. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. ఫిల్మ్ మేకింగ్లో ఈ మూవీ అడ్వాన్స్గా ఉంటుందని అర్థం అవుతోంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. ఈ సినిమా తమ కెరీర్కు టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారు నటీనటులు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియెన్స్ను ఇస్తుందని దర్శక నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.