ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్​తో గ్రూప్స్​పై శిక్షణ

ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్​తో గ్రూప్స్​పై శిక్షణ

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​ 1, 2, 3 పోటీ పరీక్షలపై ప్రొఫెసర్​ కె. నాగేశ్వర్​తో ప్రత్యేక లైవ్​ కార్యక్రమం ఉంటుందని టీశాట్​ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​ రెడ్డి తెలిపారు. సోమవారం నిపుణ చానల్​లో ఉదయం 11 గంటల లైవ్​ షో ఉంటుందన్నారు. పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సందేహాలుంటే 040 23540326, 040 23540726 లేదా టోల్​ ఫ్రీ నంబర్​ 1800 425 4039 కు ఫోన్​ చేయాలని సూచించారు. 15 రోజులుగా గ్రూప్​ 1, 2, 3తో పాటు ఇతర పోటీ పరీక్షలకు గ్రూప్​ గైడెన్స్​ పేరుతో టీ శాట్​ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించామని వేణుగోపాల్ గుర్తు చేశారు.

ఆర్థిక, సామాజిక, విద్యారంగ అంశాలపై ‘ఎక్స్​ప్లెయిన్డ్​ బై ప్రొఫెసర్​ నాగేశ్వర్​’ అనే కార్యక్రమాన్నీ ఇటీవలే ప్రారంభించామన్నారు. షార్ట్​ వీడియోల ద్వారా రాజ్యాంగపరమైన అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.  టీశాట్​ విద్య, నిపుణ చానెళ్లలో ఉదయం 8, రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుందని తెలిపారు.