న్యూఢిల్లీ : భారత నేవీ వైస్ చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా పనిచేశా రు. మహారాష్ట్ర ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి.. 1985లో నేవీలో చేరారు.
కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్పెషలిస్ట్ గా, నేవీ ఫ్రంట్లైన్ యుద్ధనౌకల్లో సిగ్నల్ కమ్యూనికేషన్ ఆఫీసర్గా పనిచేశారు. వినాశ్, కిర్చ్, త్రిశూల్ నౌకలకు నాయకత్వం వహించా రు. 2009లో నౌ సేన మెడల్ లభించింది. 2020లో అతి విశిష్ట సేవా మెడల్ను కూడా పొందారు.