అనాథలకు దుస్తుల పంపిణీ

అనాథలకు దుస్తుల పంపిణీ

కంది, వెలుగు :  అనాథ  పిల్లలకు ఎల్లప్పుడు పీఎంకే ఫౌండేషన్​ అండగా ఉంటుందని ఫౌండేషన్​ వైస్​ చైర్మన్​ పట్నం రవితేజ తెలిపారు. మంగళవారం చిల్డ్రన్స్​ డే సందర్భంగా సంగారెడ్డి టౌన్​లోని ఓపెన్ షెల్టర్ ఫర్ బాయ్స్ అనాథశ్రమంలో కేక్​ కట్​ చేసి అక్కడి పిల్లలకు కొత్త బట్టలు అందజేశారు. 

పిల్లలకు ఎలాంటి అవసరమున్న తమ ఫౌండేషన్​ను సంప్రదిస్తే సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే కొండాపూర్​ మండలం తమ్మళిభాయ్​ తండాలోని  ప్రైమరీ స్కూల్​లో ప్రధానోపాధ్యాయురాలు అలివేణి ఆధ్వర్యంలో చిల్ర్డన్స్​ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేశాలతో అలంకరించి నృత్యరూపకం చేయించారు.