రోడ్ల దుస్థితిపై చిన్నారి రిపోర్టింగ్

రోడ్ల దుస్థితిపై చిన్నారి రిపోర్టింగ్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో ఓ చిన్నారి రిపోర్టర్ గా మారిపోయింది. తన గ్రామంలో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇలాంటి రోడ్ల వల్ల తమ ఇంటికి చుట్టాలు కూడా రావట్లేదని తెలిపింది. రిపోర్టర్ మాదిరిగా రోడ్ల పరిస్థితిని వివరించి.. చివర్లో కెమెరామన్ అమ్మతో అంటూ సెండాఫ్ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల జమ్మూ కశ్మీర్ లో భారీ మంచు, వర్షం వల్ల రోడ్లన్నీ బురదగా మారిపోయాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 

మరిన్ని వివరాల కోసం: 

ఇది తెలుగు సినిమా గెలవాల్సిన టైమ్

మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా

ఢిల్లీలో ఆఫీసులు బంద్.. బార్లు రెస్టారెంట్లు క్లోజ్