నేను చనిపోతే కేసీఆరే కారణం.. ధరణితో భూమిని కాజేశారు

నేను చనిపోతే కేసీఆరే కారణం.. ధరణితో భూమిని కాజేశారు
  • నేను చనిపోతే కేసీఆరే కారణం ధరణితో భూమిని కాజేశారు
  •     సోషల్ మీడియాలో యువకుడి వీడియో వైరల్  

భీమదేవరపల్లి, వెలుగు:  ధరణి పోర్టల్ తో తన భూమిని తమకు దక్కకుండా అన్యాయం చేశారని, త్వరలో ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పొన్నాల అజయ్ రెడ్డి గత ఏడాది నవంబర్ 17న తన భూమిని ధరణి పోర్టల్ ద్వారా తమ పెదనాన్న అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అప్పుడు అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మూడు నెలలు గడిచినా న్యాయం జరగడం లేదని, 5వ తారీఖు లోపు సమస్య పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అజయ్​ మళ్లీ వీడియో తీశాడు. తన చావుకు సీఎం కేసీఆర్, రెవెన్యూ డిపార్ట్​మెంట్, తన పెదనాన్న కారణమని చెబుతూ సోషల్​మీడియాలో పెట్టాడు.  ఇది ఇప్పుడు వైరల్​ గా మారింది.