Viral Video : వందే భారత్ రైలులో వాటర్ ఫాల్..

Viral Video : వందే భారత్ రైలులో వాటర్ ఫాల్..

మోదీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లపై ప్రయణికులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇండియన్ రైల్వేలోనే నూతనంగా వచ్చిన ఈ ట్రైన్స్ లో ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే కంఫర్టబుల్ గా.. జర్నీ బాగుంటుందని ఎక్కిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. రైలులో వాటర్ ఫాల్స్ పడినట్లుగా నీళ్లు లీకవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. 

వందే భారత్ ట్రైన్స్ వచ్చాక.. సాధారణ రైళ్ల నిర్వహణ గురించి రైల్వే శాఖ ఆలోచించడం లేదనే విమర్శలు వచ్చిన తరుణంలో.. వాటి మాదిరిగానే ఈ రైళ్ల మెయింటెనెన్స్  కూడా గాలికి వదిలేసినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

ఢిల్లీకి వెళ్తున్న 22415 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఏసీ డెక్ నుంచి వాటర్ లీకేజ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బొట్టుబొట్టుగా కొద్దిపాటి లీకేజ్ అయితే అంతగా ఆలోచించేవారు కారేమో. కానీ వాటర్ ఫాల్ దూకినట్లుగా నీళ్లు లీక్ కావడంతో వైరల్ గా మారింది. ఈ వాటర్ లీకేజీ కారణంగా ప్రయాణికుల లగేజీ సైతం తడిసిపోయాయి. ఈ లీకేజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

‘‘ ప్రయాణీకుల కోసం వందే భారత్ ట్రైన్ వాటర్ ఫాల్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచ స్థాయి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, మీరు స్నానం చేస్తూ ప్రయాణించవచ్చు. ఇదంతా 'వారి' డైనమిక్ మార్గదర్శకత్వంలో సాధ్యమైంది. ధన్యవాదాలు చెప్పండి’’ అంటూ (@ranvijaylive) రణవిజయ్ సింగ్ అనే ఎక్స్ యూజర్ నెట్టింట వీడియో పోస్ట్ చేశాడు.

ఈ సెటైరికల్ పోస్ట్ సోషల్ మీడియాలో  తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి కామెంట్స్, రిప్లైలు ఫుల్లుగా వస్తున్నాయి. ఇప్పుడే కాదు.. 2024లో కూడా ఇదే మాదిరిగా వందే భారత్‌ రైలులో వాటర్ లీకేజీ జరిగినట్లు ఆ వీడియోలను ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఎంతో పబ్లిసిటీ చేసిన వందే భారత్ ట్రైన్స్ అసలు రూపం ఇది అని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. క్స్ వేదికగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇండియన్ రైల్వేకు వీడియోను నెటిజన్‌లు ట్యాగ్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. 

జూన్ 23న ఎక్స్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా వేలల్లో వ్యూస్, కామెంట్స్ వస్తున్నాయి. అంత ఇంత అని ఊదరగొట్టిన రైళ్లలో పూర్ మెయింటెనెన్స్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.