పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్..

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎన్టీఆర్ హీరోయిన్..

సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను బయటి ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ, డెలివరీకి సంబంధించిన విషయాలను అభిమానులకు చెప్పుకోరు. దీంతో పాటు తమ బిడ్డల ముఖాలను కూడా బయటిప్రపంచానికి చూపించరు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తాను జన్మనిచ్చిన విషయాన్ని దాచింది. లేటైనా ఈ విషయం లెటెస్ట్గా అభిమానులకు తెలిసింది.

ఎవరా హీరోయిన్ ..

కొరటాల శివ దర్శకత్వం వహించిన జనతా గ్యారేజీ మూవీలో నటించిన విదిషా శ్రీవాస్తవ..జులై 11వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్లో అనేక సినిమాల్లో నటించిన విదిషా..కొన్ని రోజుల ముందు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే విషయాన్ని మాత్రం వివరించలేదు. ప్రెగ్నెన్సీతోనే ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలోనే జులై 11వ తేదీన విదిషా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 2018లో విదిషా తన బాయ్ ఫ్రెండ్ సాయిక్ పాల్ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని నాలుగేళ్ల పాటు దాచిన ఆమె....2022లో  పెళ్లి విషయాన్ని బయటపెట్టింది.   తాము బనారస్లో పెళ్లి చేసుకున్న విషయాన్ని వెల్లడించింది. 

 2007 లో విడుదల అయిన ‘మా ఇద్దరి మధ్య’ అనే సినిమా ద్వారా విదిషా శ్రీవాస్తవ టాలీవుడ్లో  ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో అలా, ప్రేమ్, అత్తిలి సత్తిబాబు LKG లాంటి చిత్రాల్లో  నటించింది. హీరో శ్రీకాంత్ తోనూ ఓ మూవీలో నటించింది. అయితే జూనియర్  ఎన్టీఆర్ తో  నటించిన జనతా గ్యారేజ్ సినిమాతో విదిషాకు మంచి గుర్తింపు దక్కింది.