హిందూ ఆలయాల నిధులను వాటికే ఖర్చు చేయాలి

హిందూ ఆలయాల నిధులను వాటికే ఖర్చు చేయాలి

తిరుపతి: ఏపీ దేవాదాయ శాఖ పనితీరు బాగోలేదని పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి మహాస్వామి మండిపడ్డారు. సెక్యూలర్ సంక్షేమ పథకాల కోసం ఆలయాల ఆదాయంలో నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయొద్దన్నారు. ఆలయాల నిధులను ఇతర హిందూ దేవాలయాల కోసం మాత్రమే వెచ్చించాలని చెప్పారు.

‘ఆంధ్రప్రదేశ్‌‌లో ఆలయాల మీద జరుగుతున్న దాడులు, నగలు, ఆస్తులను కాపాడేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి, నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలి. పురావస్తు శాఖ పరిధిలోని ఆలయాల పరిరక్షణ గురించి కమిటీతో చర్చించి దేవాలయాలను ప్రభుత్వం సంరక్షించాలి. త్వరలో సనాతన ధర్మ పరిరక్షణ మహాసభను నిర్వహించబోతున్నాం’ అని విద్యాశంకర భారతి పేర్కొన్నారు.