
విజయ్ దేవరకొండ కెరీర్లో ‘గీత గోవిందం’ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకూ యూత్లో క్రేజ్ ఉన్న విజయ్ను ఈ చిత్రంతో ఫ్యామిలీస్కు దగ్గర చేశాడు దర్శకుడు పరశురామ్. ఇప్పుడీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఇటీవల ఈ కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ ప్రెస్టీజియస్ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. సమంత హెల్త్ ఇష్యూస్తో కొద్ది నెలలు షూటింగ్కి బ్రేక్ పడిన ఈ సినిమా.. ఈ నెలాఖరులో తిరిగి షూటింగ్ మొదలవబోతోంది. మరోవైపు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ ఓ సినిమాలో నటించాల్సి ఉంది. ఇప్పుడిక పరశురామ్ సినిమాకు కూడా కమిట్ అవడంతో.. ఈ రెండింట్లో ఏది ముందుగా మొదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే గౌతమ్ సినిమాకే ముందుగా ఓకే చెప్పాడు కనుక దాన్నే ముందు స్టార్ట్ చేయబోతున్నాడట విజయ్. ఏప్రిల్ నుండి షూట్ మొదలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇయర్ ఎండింగ్లో పరశురామ్ సినిమా షూట్ స్టార్ట్ చేయనున్నారు. మొత్తానికి ఈ ఏడాది మూడు సినిమాల షూటింగ్స్తో బిజీ అవుతున్నాడు విజయ్.