విజయా రెడ్డి హత్య: మరో రెండు రోజులు రెవిన్యూ ఉద్యోగులు బంద్

విజయా రెడ్డి హత్య: మరో రెండు రోజులు రెవిన్యూ ఉద్యోగులు బంద్

హైదరాబాద్ : MRO విజయారెడ్డి  సజీవ దహన ఘటనపై  నిరసనగా  మరో రెండు రోజులు బంద్ పాటిస్తామని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తాసీల్దార్లు, వీఆర్వో, వీ ఆర్ ఏ, రెవెన్యూ సర్వీసెస్ తో కూడిన జేఏసీ బంద్ ప్రకటన చేసింది. ఈ దారుణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని,  విజయా రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జేఏసీ  కోరింది.  ఈ ఘటనలో ఎమ్మార్వో ని కాపాడబోయి మృతి చెందిన  డ్రైవర్ గురునాథం కుటుంబానికి తమ వంతు సాయంగా ఉద్యోగులంతా ఒకరోజు జీతాన్ని ఇవ్వనున్నట్టు జేఏసీ తెలిపింది. ప్రభుత్వం కూడా అతని కుటుంబానికి ఆర్ధిక సాయం చేయాలని కోరింది.

Vijaya Reddy's murder: Revenue employees bandh for two more days