
హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజలకు అయోధ్య రాముడెంతో భద్రాద్రి రాముడూ అంతేనని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. గురువా రం ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. "దేశ ప్రజలు అయోధ్య రాముడిని ఎంత అభిమానిస్తారో.. మా భద్రాద్రి రాములవారిని కూడా అంతే విశ్వ సిస్తారు. మా భద్రాద్రి శ్రీరాముడి సందర్శన భక్తి, గౌరవంతో కూడిన అంశం అని అందరు తప్పక దృష్టి లో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకు ఎన్నోసార్లు వచ్చిన ప్రధాని మోదీ, అమిత్ షా భద్రాద్రి రాముడిని గుర్తించాలి" అని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.