రాజాసింగ్​పై  సస్పెన్షన్ ఎత్తెయ్యాలని కోరుకుంటున్నం

రాజాసింగ్​పై  సస్పెన్షన్ ఎత్తెయ్యాలని కోరుకుంటున్నం
  • బీజేపీ నేత విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమ వుతున్నట్లు కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారని బీజేపీ నేత విజయ శాంతి పేర్కొన్నారు. అయితే.. బండి సంజయ్ తో సహా రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుకుంటున్నామని, అలాగే జరుగుతుందని నమ్ముతున్నామని ఒక ప్రకటనలో చెప్పారు.

సరైన సమయంలో అంతా మంచే జరుగుతుందని, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా ..అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుందని తెలిపారు.