RSS ప్రధాన కార్యాలయంలో దసరా వేడుకలు

RSS ప్రధాన కార్యాలయంలో దసరా వేడుకలు

మహారాష్ట్ర: నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ (RSS) ప్రధాన కార్యాలయంలో విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి గడ్కరీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ దసరా వేడుకలకు తొలిసారి ఓ మహిళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ సంతోషి యాదవ్ పాల్గొన్నారు.