వైఎస్​కు నివాళి అర్పించిన విజయమ్మ, షర్మిల

వైఎస్​కు నివాళి అర్పించిన విజయమ్మ, షర్మిల

మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్​రాజశేఖర్​రెడ్డి 74 వ జయంతిని జులై 8న రాయలసీమలోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్​ ఘాట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య వైఎస్ విజయమ్మ, వైఎస్​ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పాల్గొన్నారు. ప్రత్యక ప్రార్థనలు జరిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్  మధ్యాహ్నం  వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద  నివాళి అర్పిస్తారు.  

ఇడుపులపాయ నుంచే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి..

అనంతరం వైఎస్​ షర్మిల  మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అదే స్ఫూర్తితో తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరుకి వెళ్తున్నానని అన్నారు.