మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్రాజశేఖర్రెడ్డి 74 వ జయంతిని జులై 8న రాయలసీమలోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య వైఎస్ విజయమ్మ, వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ప్రత్యక ప్రార్థనలు జరిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్ మధ్యాహ్నం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు.
ఇడుపులపాయ నుంచే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి..
అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అదే స్ఫూర్తితో తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరుకి వెళ్తున్నానని అన్నారు.