పనిగట్టుకుని నాపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్రు

పనిగట్టుకుని నాపై  వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్రు

బీజేపీకి దూరమవుతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. కొంతమంది నేతలు పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. 

చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. పార్టీకి ఏదీ ముఖ్యమో.. ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు స్పష్టంగా చెప్పానని.. ఆ విషయాలు బయటకు లీక్ చేయడానికి తాను వ్యతిరేకమన్నారు.