విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు పీఎంఓ ఆదివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ ఘటన గురించి తెలియగానే ఏపీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది.
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the fire at a Covid centre in Vijayawada. Rs. 50,000 each would be given to those injured due to the fire.
— PMO India (@PMOIndia) August 9, 2020