న్యూఢిల్లీ: ఆఫ్రికాలో విస్తరించడానికి హైదరాబాద్ఫార్మా కంపెనీ నాట్కో రూ.2,500 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఇందులో రూ.1,500 కోట్లను దక్షిణాఫ్రికా సబ్సిడరీకే కేటాయిస్తామని తెలిపింది. దక్షిణాఫ్రికాకు చెందిన అడ్కాక్ఇన్గ్రామ్లో వాటాను 35 శాతం నుంచి 49 శాతానికి పెంచుకుంటామని ప్రకటించింది.
ఇన్గ్రామ్కు చెందిన 1,96,18,825 షేర్లను రూ. 5.89 చొప్పున కొనుగోలు చేయనుంది. ఇందుకోసం మొత్తం 1.8 బిలియన్ ర్యాండ్లు (రూ. 1,069 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రక్రియ అంతా ఈనెల చివరి నాటికి పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. 1890లో దక్షిణాఫ్రికాలో ఏర్పాటైన అడ్కాక్ ఇన్గ్రామ్..మందులు, వినియోగదారుల ఉత్పత్తులు, ఓటీసీ ప్రొడక్టులను తయారు చేస్తుంది.
