- వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి
కొడంగల్, వెలుగు : జిల్లాలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని మిషన్భగీరథ అధికారులను వికారాబాద్కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం కొడంగల్లో కలెక్టర్ సమీక్ష చేశారు. ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడకుండా మిషన్ భగీరథ నీటి సరఫరాతో పాటు ప్రత్యామ్నాయంగా బోర్వెల్స్, చేతి పంపుల మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీవో శ్రీనివాస్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరామ్నాయక్, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ఆంజనేయులు, ఇంజనీర్లు బాబు,శ్రీనివాస్, పాల్గొన్నారు.