పార్లమెంట్ ఎన్నికలపై పార్టీలతో మీటింగ్

 పార్లమెంట్ ఎన్నికలపై పార్టీలతో మీటింగ్

వికారాబాద్, వెలుగు :  వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పార్లమెంటు ఎన్నికల నిర్వహణ, ఓటర్ నమోదు, సవరణలపై సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా శని, ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని తెలిపారు.

ఓటరు జాబితాలతో ఎల్ఓలు అందుబాటులో ఉంటారని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేందుకు, తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.  ఈ సమావేశంలో జిల్లా అడిషన ల్ కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్ తహసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎలక్షన్ సెక్షన్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు  పాల్గొన్నారు.