14 ఎకరాలు పంచిస్తే.. అన్నం పెడ్తలేరు..కుమారుల నుంచి తన ఆస్తి ఇప్పించాలని బాధితుడి ఫిర్యాదు

14 ఎకరాలు పంచిస్తే.. అన్నం పెడ్తలేరు..కుమారుల నుంచి తన ఆస్తి ఇప్పించాలని బాధితుడి ఫిర్యాదు

పరిగి, వెలుగు: వికారాబాద్​ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్​కు చెందిన చల్ల హన్మంత్​రెడ్డి తన ఇద్దరు కుమారులపై మంగళవారం వికారాబాద్​ఆర్డీవో ఆఫీస్​లో ఫిర్యాదు చేశారు. 

చెరో ఏడెకరాల భూమి పంచిస్తే.. కుమారులు తనకు అన్నం పెట్టడం లేదని, కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారు తన పోషణ బాధ్యత చూసుకోకపోతే.. తాను కష్టపడి సంపాదించిన భూమిని తిరిగి తనకు ఇప్పించాలని కోరారు.