86 లిక్కర్ బాటిళ్లు, రూ.5 లక్షల క్యాష్ సీజ్

86 లిక్కర్ బాటిళ్లు, రూ.5 లక్షల క్యాష్ సీజ్

వికారాబాద్/ఘట్​కేసర్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 86 లిక్కర్​బాటిళ్లను వికారాబాద్​రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.89వేల112 ఉంటుందని ఆర్పీఎఫ్​సీఐ రాజేంద్ర ప్రసాద్​తెలిపారు. రెండు బ్యాగుల్లో తరలిస్తున్న వివిధ రకాల బ్రాండ్ల 86 బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఎక్సైజ్ ఎస్సై వాణికి అప్పగించినట్లు చెప్పారు.

అలాగే ఘట్ కేసర్​లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆ టైంలో అటుగా వచ్చిన బొలారో వెహికల్​ను తనిఖీ చేయగా, రూ.5లక్షల క్యాష్​దొరికింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో పోలీసులు నగదును సీజ్​ చేశారు.