వికారాబాద్/ఘట్కేసర్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 86 లిక్కర్బాటిళ్లను వికారాబాద్రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.89వేల112 ఉంటుందని ఆర్పీఎఫ్సీఐ రాజేంద్ర ప్రసాద్తెలిపారు. రెండు బ్యాగుల్లో తరలిస్తున్న వివిధ రకాల బ్రాండ్ల 86 బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఎక్సైజ్ ఎస్సై వాణికి అప్పగించినట్లు చెప్పారు.
అలాగే ఘట్ కేసర్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆ టైంలో అటుగా వచ్చిన బొలారో వెహికల్ను తనిఖీ చేయగా, రూ.5లక్షల క్యాష్దొరికింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు.