పెద్దపల్లి, వెలుగు: పొట్టచేతపట్టుకొని మధ్యప్రదేశ్నుంచి వచ్చిన ఓ బాలిక(14)పై కొందరు గ్యాంగ్రేప్చేయగా, తీవ్ర గాయాలతో ఆమె చనిపోయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి సమీపంలోని అప్పన్నపేటలో కొత్తగా కడ్తున్న అపార్ట్మెంట్స్నిర్మాణ పనుల కోసం మధ్యప్రదేశ్నుంచి సుమారు 10 కుటుంబాలకు చెందిన 50 మంది దాకా వచ్చి స్థానికంగా గుడిసెలువేసుకొని నివాసం ఉంటున్నారు. వీరిలో ఓ 14 ఏండ్ల బాలిక అక్కాబావలతో కలిసి భవన నిర్మాణ పనుల కోసం వచ్చింది. కాగా, ఈ నెల 14 న ఉదయం నిర్మాణ పనుల కోసం అంటూ బాలికను ఒకరు వచ్చి తీసుకెళ్లారు. సాయంత్రమైనా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. అదే రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో బాలికను గుడిసెల వద్ద కొందరు వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే బాలిక తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెపై గ్యాంగ్ రేప్జరిగిన ఆనవాళ్లు గుర్తించిన కుటుంబసభ్యులు.. ఓ ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది.