పెదకాపు ప్రేక్షకుల మనసుని కదలించింది

పెదకాపు ప్రేక్షకుల మనసుని కదలించింది

విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పెదకాపు’. గత శుక్రవారం సినిమా విడుదలయింది. దీనికొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు ఆదివారం ప్రెస్‌‌మీట్ నిర్వహించింది టీమ్. విరాట్ కర్ణ మాట్లాడుతూ ‘సినిమా గురించి, నా పెర్ఫార్మెన్స్ గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కథని నమ్మి కొత్త హీరోతో ఇంత గ్రాండ్‌‌గా సినిమా నిర్మించిన మా బావగారు(మిర్యాల రవీందర్ రెడ్డి) గారికి థ్యాంక్స్. 

మా డైరెక్టర్ గారు ఇంత మంచి సీన్స్ రాయడం వలనే నాలో ఇలాంటి పెర్ఫార్మెన్స్ బయటికి వచ్చింది. చోటా కె నాయుడు గారు చాలా బ్యూటిఫుల్‌‌గా సినిమాని తీశారు. ప్రతి ఫ్రేం బావుందని ఆడియెన్స్ చెబుతున్నారు. నా తొలి సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ స్పెషల్ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంది ప్రగతి. ‘ఈ సినిమా ప్రేక్షకుల మనసుని కదలించింది. చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం హ్యాపీ’ అన్నారు శ్రీకాంత్ అడ్డాల, మిర్యాల రవీందర్ రెడ్డి. సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.