టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీని రెండు మ్యాచ్ లతో సరిపెట్టాడు. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ మంగళవారం (జనవరి 6) రైల్వేస్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు తాను అందుబాటులో ఉండనని కోహ్లీ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు తెలియజేశాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు సిద్ధమవ్వడం కోసం కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీని దాటివేశాడు. ఈ విషయం కోహ్లీ ఫ్యాన్స్ కు కాస్త బ్యాడ్ న్యూస్ అయినా వారంలో అంతర్జాతీయ మ్యాచ్ లో తమ ప్లేయర్ ను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
దాదాపు 15 ఏండ్ల తర్వాత తొలిసారి విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలో చేలరేగిన తర్వాత తన సూపర్ ఫామ్ను ఇక్కడ కొనసాగించాడు. డిసెంబర్ 24 బెంగుళూరు వేదికగా ఏపీతో జరిగిన మ్యాచులో కోహ్లీ శతకంతో చెలరేగాడు. తనకు ఎంతో ఇష్టమైన ఛేజింగ్లో సెంచరీ సాధించి ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు. ఈ సెంచరీ లిస్ట్ ఏ క్రికెట్లోకి కోహ్లీకి 58వది. అలాగే.. ఈ మ్యాచులో విరాట్ మరో రికార్డ్ సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఇండియన్ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు.
ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సచిన్ 21,999 పరుగులు చేసి తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో మ్యాచ్ లో గుజరాత్ పై కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 61 బాల్స్లో 13 ఫోర్లు, 1 సిక్స్తో 77 పరుగులు చేశాడు. చాలా ఏండ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినప్పటికీ.. నేషనలైనా.. ఇంటర్నేషలైనా మాకు సంబంధంలే అన్నట్లు చెలరేగి ఆడాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ సిరీస్ లో బాగా ఆడితే రోహిత్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకోవచ్చు.
