కార్తిక్ దండు(Karthik Dandu) డైరెక్షన్ లో వచ్చిన విరూపాక్ష బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు. ఈ మూవీకి స్టోరీ , స్క్రీన్ప్లే ను డైరెక్టర్ సుకుమార్ అందించగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విరూపాక్ష తెరకెక్కించిన మూవీ టీం నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది. ఈ మూవీ మైథికల్ థ్రిల్లర్ గా రాబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రపంచంలో నమ్మ శక్యం కానీ విషయాలను..నమ్మడానికి సిద్ధంగా ఉండండి ఉంటూ సుకుమార్(Sukumar) ట్వీట్ చేశారు. ఈ మూవీకు కూడా సుకుమార్ స్టోరీ అందిస్తుండగా..కార్తిక్ దండు డైరెక్షన్ చేస్తున్నారు.
రెండు కొండల నడుమ ఎర్రటి సూర్యుడు కనిపిస్తుండగా..తాడుతో వ్రేలాడుతున్న మిస్టీరియస్ వ్యక్తుల పోస్టర్ తో క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. ఇవాళ (ఆగష్టు14) నుంచి మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో హీరో ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ గా రెవీల్ చేయలేదు మేకర్స్. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు.
‘విరూపాక్ష’ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టి సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.తెలుగులో చాలాకాలం తర్వాత భిన్నమైన కథతో వచ్చిన విరూపాక్ష.. ఇక విరూపాక్ష2 కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
The Team Of #Virupaksha is back! ?
— SVCC (@SVCCofficial) August 14, 2023
Get ready to believe in the unbelievable, this time it’s a MYTHICAL THRILLER ?
Directed by @karthikdandu86 ?
Produced by @SVCCofficial & @SukumarWritings ?
Pre-Production Works Begins From Today! ✨
Stay tuned for more details soon! pic.twitter.com/LboCQU2nOu