- అంబేద్కర్ కాలేజీలో న్యూట్రివిండ్ సీఈవో విశాల్
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులు తమకున్న సమస్యలను అధిగమించి క్రమశిక్షణ, సంకల్పంతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని న్యూట్రివిండ్ సీఈవో విశాల్ మావూరి సూచించారు. గురువారం బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్లో క్లినికల్ న్యూట్రిషన్ విభాగ ఆధ్వర్యంలో సైన్స్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై సదస్సు నిర్వహించారు.
న్యూట్రివిండ్ హెల్త్ కేర్ వ్యవస్థాపకులు సీఈవో విశాల్ మావూరి ముఖ్య అతిథిగా హాజరై.. ప్రస్తుతం క్లినికల్ న్యూట్రిషన్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి లైఫ్ సైన్స్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బి. అనూష, సీఆర్ కీర్తన, ఇనిస్టిట్యూషన్ అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.