Gaami OTT: గామి రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌..72 గంటల్లో ఎంతంటే?

Gaami OTT: గామి రికార్డు స్థాయిలో స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌..72 గంటల్లో ఎంతంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా వచ్చిన సరికొత్త కథా చిత్రం గామి(Gaami). కొత్త దర్శకుడు విద్యాధర్(Vidyadhar) తెరకెక్కించిన ఈ సినిమాలో చాందిని చౌదరి(Chandini Chaudary) హీరోయిన్ గా నటించగా..మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. వినూత్న కథా, కథనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దాదాపు ఆరు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని విజువల్స్, గ్రాఫిక్స్ కోసం టీమ్ చాలా కష్టపడ్డారు. అవే ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగించాయి. 

ప్రస్తుతం గామి సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్  అవుతుంది. తాజా సమాచారం ప్రకారం..విశ్వ‌క్‌సేన్ గామి ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అద‌ర‌గొడుతోంది. నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉన్న ఈ మూవీ 72 గంట‌ల్లోనే యాభై మిలియ‌న్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.అతి త‌క్కువ టైమ్‌లో ఎక్కువ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్‌ను ద‌క్కించుకున్న మూవీగా గామి నిలిచింది.

దాదాపు రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో క్రౌడ్ ఫండింగ్ విధానంలో తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల‌కుపైగా కలెక్షన్స్ రాబ‌ట్టింది. దీంతో మంచి సక్సెస్ అందుకున్న విశ్వక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులోభాగంగా ప్రస్తుతం తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీ మే 17న రిలీజ్ కాబోతుండ‌గా..మెకానిక్ రాఖీ షూటింగ్‌ దశలో ఉంది. ఇక రీసెంట్ గా లైలా అనే మూవీని ప్రకటించాడు విశ్వక్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

గామి కథేంటంటే: 

శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా.తనెవరనేది..తన గతమేంటనేది..అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు..ఈ జ్ఞాపకాలేం తనకు గుర్తుండవు.ఇతడికి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది.పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు.దీంతో తోటి అఘోరాలంతా తనని శాపగ్రస్థుడుగా భావించి..ఆశ్రమం నుంచి వెలివేస్తారు.ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు.తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు.అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్‌.ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు..అతడికి ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సినిమా స్టోరీ.