Cricket World Cup 2023: స్టేడియం బయట కిక్కిరిసిన జనం..భారత జెండాలతో సందడి చేస్తున్న ఫ్యాన్స్

Cricket World Cup 2023: స్టేడియం బయట కిక్కిరిసిన జనం..భారత జెండాలతో సందడి చేస్తున్న ఫ్యాన్స్

సాధారణంగా వరల్డ్ కప్ లాంటి టోర్నీలో భారత్ జట్టు క్రికెట్ ఆడుతుందంటే స్టేడియం మొత్తం ఫ్యాన్స్  నిండిపోవడం ఖాయం. ఈ సారి వరల్డ్ కప్ భారత్ లో జరగడం అది కూడా పాకిస్థాన్ తో మ్యాచ్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మ్యాచు కోసం గత కొన్ని నెలలుగా ఎంతో చూసిన అభిమానులకి ఆ రోజు రానే వచ్చింది. ఇంకేముంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే అహ్మదాదాబాద్ స్టేడియం కి చేరుకున్నారు. 

తెల్లవారుజాము నుంచే అభిమానులు స్టేడియం వెలుపల క్యూలో నిల్చున్నారు. వారిలో చాలా మంది ట్రేడ్‌మార్క్ బ్లూ ఇండియన్ క్రికెట్ టీమ్ జెర్సీలను ధరించి, చేతిలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని, "ఇండియా" "ఇండియా" అని అరుస్తూ తమ ప్రేమను చాటుకున్నారు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి పలువురు మద్దతు తెలిపారు. విరాట్ కోహ్లిని చూసి భయపడుతున్న పాకిస్థాన్....ఈరోజు సెంచరీ చేస్తాడని ఓ అభిమాని చెప్పాడు. 

మరో క్రికెట్ అభిమాని మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో హీరో అవుతాడు, పాకిస్థాన్‌తో మ్యాచుకు అతడు నెక్స్ట్ లెవల్ గేమ్ ఆడతాడు. అని తెలిపాడు. ఇక ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కోసం అనుష్క శర్మ ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది. సచిన్, కామెంటేటర్ దినేష్ కార్తిక్ కూడా అహ్మదాబాద్ చేరుకున్నారు.