రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది : వివేక్ వెంకట స్వామి

రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది : వివేక్ వెంకట స్వామి

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి అన్నారు. నెలకు 24 లక్షల జీతం కేవలం కేసీఆర్ కుటుంబమే తీసుకుంటోందన్నారు. నిర్మల్ జిల్లాలో 3 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం తమకు సంతోషంగా ఉందన్నారు.

నిర్మల్ నియోజకవర్గంలో మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో నిరుపేదలను అదుకున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే అన్నారు. అంతకుముందు.. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకట స్వామి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు. 

బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి నిర్మల్ నియోజకవర్గానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, ఆల్జాపూర్ శ్రీనివాస్ లకు బీజేపీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సెంట్ థమన్ స్కూల్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకట స్వామి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు.