కేసీఆర్​ను గద్దె దించేవరకు పోరాటం ఆపేది లేదు : వివేక్​ వెంకటస్వామి

కేసీఆర్​ను గద్దె దించేవరకు పోరాటం ఆపేది లేదు : వివేక్​ వెంకటస్వామి

మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ ​స్టేట్​లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. ఎనిమిదేండ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ప్రజలు బీఆర్​ఎస్​ సర్కారుపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ను గద్దె దించేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్​ మండలం నాగపూర్​ గ్రామంలో బుధవారం నిర్వహించిన బీజేపీ కార్నర్​మీటింగ్​కు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్​ రైతులను కోటీశ్వరులను చేస్తానని చెప్పి.. తన కుటుంబ సభ్యులనే ధనవంతులను చేశాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్​ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేశామని గుర్తుచేశారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బ్యాక్​ వాటర్​ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్​ హామీ ఇచ్చాడన్నారు. ముంపు భూములకు ఎకరానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్​ చేశారు. 

మీటింగ్​ను అడ్డుకున్న బీఆర్​ఎస్​ లీడర్లు

 మీటింగ్​లో ప్రజలు సమస్యలను తెలుపుతూ ప్రభు త్వంపై అసహనం వ్యక్తం చేస్తుంటే జీర్ణించుకోలేని బాల్క సుమన్ అనుచరులు మీటింగ్​ను అడ్డుకొని అలజడి సృష్టించారు. పోలీసులు వచ్చి ఇరువర్గా లను అక్కడినుంచి పంపించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్​ చెన్నూర్ ​సెగ్మెంట్​లో అవినీతిలో మునిగిపోయి అక్రమ సంపాదన పెంచుకున్నాడని వివేక్​ మండిపడ్డారు. ఈ మీటింగ్​లో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్​జాయింట్​కన్వీనర్​నగునూరు వెంకటేశ్వర్లు గౌడ్​, చెన్నూర్​ టౌన్​ ప్రెసిడెంట్​ సుద్దపల్లి సుశీల్, జనరల్​సెక్రటరీ చింతల శ్రీనివాస్, చెన్నూర్, జైపూర్​ మండలాల అధ్యక్షులు ఆలం బాపు, విశ్వంభర్​రెడ్డి పాల్గొన్నారు.

చెన్నూర్​లో ఇసుక మాఫియా

చెన్నూర్ మండలంలో ఇసుక అక్రమ రవా ణా యథేచ్ఛగా జరుగుతోందని కార్నర్ మీటింగ్​లో వివేక్​తో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇసుక మాఫియా ఆగడాలతో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కు దళితబంధు కావాలని, డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇయ్యాలని, నిరుద్యోగభృతి చెల్లించాలని, తాగునీటి సమస్య తీర్చాలని, కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ నియోజకవర్గం గజ్వేల్​లో లాగా తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.