
మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ స్టేట్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఎనిమిదేండ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను గద్దె దించేవరకు పోరాటం ఆపేది లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన బీజేపీ కార్నర్మీటింగ్కు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ రైతులను కోటీశ్వరులను చేస్తానని చెప్పి.. తన కుటుంబ సభ్యులనే ధనవంతులను చేశాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేశామని గుర్తుచేశారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బ్యాక్ వాటర్ రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చాడన్నారు. ముంపు భూములకు ఎకరానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
మీటింగ్ను అడ్డుకున్న బీఆర్ఎస్ లీడర్లు
మీటింగ్లో ప్రజలు సమస్యలను తెలుపుతూ ప్రభు త్వంపై అసహనం వ్యక్తం చేస్తుంటే జీర్ణించుకోలేని బాల్క సుమన్ అనుచరులు మీటింగ్ను అడ్డుకొని అలజడి సృష్టించారు. పోలీసులు వచ్చి ఇరువర్గా లను అక్కడినుంచి పంపించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ సెగ్మెంట్లో అవినీతిలో మునిగిపోయి అక్రమ సంపాదన పెంచుకున్నాడని వివేక్ మండిపడ్డారు. ఈ మీటింగ్లో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్జాయింట్కన్వీనర్నగునూరు వెంకటేశ్వర్లు గౌడ్, చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్ సుద్దపల్లి సుశీల్, జనరల్సెక్రటరీ చింతల శ్రీనివాస్, చెన్నూర్, జైపూర్ మండలాల అధ్యక్షులు ఆలం బాపు, విశ్వంభర్రెడ్డి పాల్గొన్నారు.
చెన్నూర్లో ఇసుక మాఫియా
చెన్నూర్ మండలంలో ఇసుక అక్రమ రవా ణా యథేచ్ఛగా జరుగుతోందని కార్నర్ మీటింగ్లో వివేక్తో ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇసుక మాఫియా ఆగడాలతో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కు దళితబంధు కావాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యాలని, నిరుద్యోగభృతి చెల్లించాలని, తాగునీటి సమస్య తీర్చాలని, కాళేశ్వరం బ్యాక్ వాటర్తో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో లాగా తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.