రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారు : వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారు : వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని సీఎం కేసీఆర్ వమ్ము చేశారని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటంగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఆస్తులు పెంచుకోవడం కోసమే కల్వకుంట్ల కుటుంబ పాలన అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పనులు అని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం పెదప్రజలకు అండగా ఉంటుందన్న ఆయన..  దేశంలో 3.50కోట్ల మందికి ఇండ్లు కట్టించిందని చెప్పారు.