
కేసీఆర్ కు చెంప దెబ్బ పడేలా… దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించాలన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా చెగుంట మండలంలో పర్యటించారు. కల్వకుంట్ల ఫ్యామిలీకి అన్ని ఉద్యోగాలు ఇప్పించుకున్న కేసీఆర్… రాష్ట్ర ప్రజలను మాత్రం మరిచిపోయారన్నారు. దళితులకు ఇచ్చిన హామీని పట్టించుకోవటం లేదన్నారు వివేక్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పెరుతో కమిషన్ లు తీసుకొని వందల ఎకరాలు కొనుక్కున్నాడన్నారు. మల్లన్న సాగర్ భుములకు ఒక రకంగా…కొండ పొచమ్మ సాగర్ భూములకు మరో రకంగా పరిహారం ఇచ్చారన్నారు. నష్టపరిహారంలో కూడ వివక్ష చూపుతున్నారన్నారు. రఘునందన్ రావుని గెలిపించి ప్రశ్నించే గొంతుకను అసెంబ్లికి పంపాలన్నారు
ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రి గేట్ వద్ద వదిలేసింది