కాళేశ్వరం ముంపు బాధితుల కోసం మహాపాదయాత్ర

కాళేశ్వరం ముంపు బాధితుల కోసం మహాపాదయాత్ర

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం నుంచి బీజేపీ మహా పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అందుగుల శ్రీనివాస్ పాదయాత్ర చేస్తున్నారు. నిన్న ప్రారంభమైన పాదయాత్ర రేపు మంచిర్యాల కలెక్టరేట్ దగ్గర ముగియనుంది. బీజేపీ స్టేట్ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఇవాళ పాదయాత్రలో పాల్గొననున్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ వల్ల పదివేల ఎకరాల పంటలు నీట మునిగి నష్టపోయిన రైతులకు సంఘీభావంగా మహా పాదయాత్ర చేయనున్నారు వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే పలుసార్లు కాళేశ్వరం ముంపు భూములను పరిశీలించారు వివేక్. రైతులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. కాళేశ్వరం రీడిజైన్ తో నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇవాళ కోటపల్లి మండలం బోరంపెల్లి గ్రామం నుంచి జైపూర్ వరకు పాదయాత్ర జరగనుంది.