మంచిర్యాలలో రైస్ మిల్లును ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాలలో రైస్ మిల్లును ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలం నందులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీస్ రైస్ మిల్లును బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ రైస్ మిల్లును బీజేపీ యువ నాయకుడు బొమ్మన హరీష్ గౌడ్ నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మిల్లును ప్రారంభించారు. అర్చకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైస్ మిల్లులో కలియతిరిగి నిర్మాణాన్ని పరిశీలించారు. 

వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హరీష్ గౌడ్ కు అభినందనలు తెలిపారు.