నాలుగో విడత ప్రజాసంగ్రామయాత్ర సక్సెస్ కావాలి

నాలుగో విడత  ప్రజాసంగ్రామయాత్ర సక్సెస్ కావాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ గాజులరామారం చిత్తారమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు..  నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా.. అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  భారీ బైక్ ర్యాలీతో చిత్తారమ్మ ఆలయానికి వెళ్లారు సంజయ్. అంతకుముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  బండి సంజయ్ ను, రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ ను జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కలిశారు. నాలుగో విడత పాదయాత్రకు వెళ్తున్న సందర్భంగా బండి సంజయ్ ని శాలువాతో సత్కరించారు. పాదయాత్ర సక్సెస్ కావాలని వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. 

కాసేపట్లో కుత్బుల్లాపూర్ లోని రాంలీల మైదానంలో జరిగే సభలో  బండి సంజయ్ పాపాల్గొంటారు . బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్..ముఖ్యఅతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభమై.. ఈనెల 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట్ లో ముగియనుంది. నాల్గోవిడతలో 11 రోజుల పాటు 110 కిలోమీటర్లు నడవనున్నారు. ఈ పాదయాత్రలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఈ నెల 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్ పేట్ లో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించనుంది.