బీజేపీ ఆఫీసులో వివేకానంద జయంతి వేడుకలు

బీజేపీ ఆఫీసులో వివేకానంద జయంతి వేడుకలు

హైదరాబాద్​, వెలుగు: బీజేపీ స్టేట్ ఆఫీసులో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆఫీసులోని వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే రాజాసింగ్, యెండల లక్ష్మీనారాయణ, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ గా రాంచందర్ రావు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ  కొత్త ఓటర్ల ఎన్ రోల్ మెంట్ కు కసరత్తు చేస్తున్నది. ఈ ఎన్ రోల్ మెంట్ కో ఆర్డినేటర్ గా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును నియమించారు.