న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ టీ3 ఎక్స్ 5జీ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 6.72-అంగుళాల డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్నాప్డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. టీ3 ఎక్స్ 5జీని వివో మూడు వేరియంట్లలో విడుదల చేసింది.
4జీబీ+128జీబీ వేరియంట్కు రూ.13,499 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్కు రూ.14,999 అవుతుంది. 8జీబీ+128జీబీ వేరియంట్కి రూ.16,499 చెల్లించాలి. ఈ స్మార్ట్ఫోన్ ఏప్రిల్ 24 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ–-స్టోర్ సహా అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి వస్తుంది. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ కార్డ్లతో కొంటే రూ. 1,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.