50 ఎంపీ కెమెరాతో వివో టీ3 ఎక్స్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

50 ఎంపీ కెమెరాతో వివో టీ3 ఎక్స్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: చైనీస్​ స్మార్ట్​ఫోన్ ​బ్రాండ్​ వివో మిడ్​ రేంజ్ ​స్మార్ట్​ఫోన్​ టీ3 ఎక్స్​ 5జీ ఫోన్​ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 6.72-అంగుళాల డిస్​ప్లే, 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్,  స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాగన్ 6 జెన్​ 1 చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి. టీ3 ఎక్స్​ 5జీని వివో మూడు వేరియంట్లలో విడుదల చేసింది.  

4జీబీ+128జీబీ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.13,499 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.14,999 అవుతుంది.  8జీబీ+128జీబీ వేరియంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రూ.16,499 చెల్లించాలి. ఈ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ ఏప్రిల్ 24 నుంచి ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్, వివో ఇండియా ఈ–-స్టోర్ సహా  అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో అమ్మకానికి వస్తుంది.  హెచ్​డీఎఫ్​సీ, ఎస్​బీఐ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కొంటే రూ. 1,500 వరకు డిస్కౌంట్‌‌ పొందొచ్చు.