అతివేగంగా వచ్చి లారీని ఢీకొన్న ఆటో.. ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

అతివేగంగా వచ్చి లారీని ఢీకొన్న ఆటో.. ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో అతివేగంగా ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నవంబర్ 22న బుధవారం ఉదయం రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో అతివేగంగా వచ్చి.. లారీ ఢీట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ALSO READ :పాఠశాల విద్యార్థుల ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు

ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్లను పట్టుకున్నారు. ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్, క్లీనర్ లను అదుపులోకి దర్యాప్తు చేపట్టారు. ఆటోలో విద్యార్థులందరు బేతని స్కూల్‌కి చెందిన వారిగా సమాచారం.